నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నందికోట్కూర్ రోడ్‌లోని కమ్మ సంఘం కళ్యాణమండపములో నిర్వహించే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశములో పాల్గొనున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. అనంతరం నంద్యాల జిల్లా పరిధిలోని డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం, జలదుర్గం చేరుకుంటారు అక్కడ పార్టీ నిర్వహిస్తున్న బాదుడే , బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ.. వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటన సాగుతుందని టీడీపీ జిల్లా నాయకులు అంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/