లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadagirigutta Temple
Yadagirigutta Temple

యదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 26 వ తేదీ నుంచి మార్చి 7 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా… ఈ నెల 28 వ తేదీన అలంకార వేడుకలను నిర్వహిస్తారు. మార్చి 3 వ తేదీన ఎదుర్కోలు, మార్చి 4 వ తేదీన తిరుకల్యాణం, మార్చి 5 వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, మార్చి 7 వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలను నిర్వహిస్తారు. మార్చి 2 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు యాదాద్రిలో సాంస్కఅతిక ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. యాదాద్రిలో జరిపే నిత్యపూజల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి 7 వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని కోరారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/