చంద్రబాబుపై ధ్వజమెత్తిన విజయసాయి రెడ్డి
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే పెప్పర్ గ్యాంగ్గ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టిడిపి పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/