చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రహ్మణి, చినరాజప్ప

రాజకీయ కార్యాచరణపై చంద్రబాబు సూచనలు చేసే అవకాశం

nara-bhuvaneswari-brahmani-and-chinarajappa-to-meet-chandrababu

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప కలిశారు. ములాఖత్ ద్వారా వారు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై వీరికి చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు, నిన్న చంద్రబాబును అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టిడిపి శ్రేణులు నిరసన దీక్షలకు చేపట్టిన సంగతి తెలిసిందే. భువనేశ్వరి, బ్రహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ దీక్షలో కూర్చున్నారు.