బెంగుళూర్ లో దారుణం : తల్లిని చంపిన కూతురు

Suicide that the corona got positive

చిన్న చిన్న సమస్యలకే మదనపడిపోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. తాజాగా రోజు తనతో గొడవపడుతుందని కన్న తల్లినే చంపేసింది ఓ కూతురు. ఆ తర్వాత శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన బెంగుళూర్ జరిగింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. కాగా ప్రతి రోజు తనతో తల్లి గొడవపడుతుందని, ఇలా రోజు రోజుకు ఎక్కువ అవుతుందని , గత రాత్రి కూడా ఇలాగె గొడవ పడ్డామని , చివరకు కోపం తట్టుకోలేక తల్లిని చంపినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని , ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.