ఈ నెల 15 న నాగపూర్ లో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ భవనం ప్రారంభం
టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి దేశ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గులాబీ జెండా ను దేశ వ్యాప్తంగా ఎగురవేయాలని అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జోరుగా చేరికలు జరుగుతుండడంతో..ఆయా ప్రాంతాలలో పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 15 న నాగపూర్ లో బీఆర్ఎస్ భవనాన్ని కేసీఆర్ ప్రారభించబోతున్నారు.
15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు. అలాగే ముంబై, పుణె, ఔరంగాబాద్లోనూ పార్టీ ఆఫీస్లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు పార్టీ భవనాల కోసం అన్వేషణ జరుగుతున్నది. బీఆర్ఎస్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమాన్ని చేపట్టింది.