మూసీ నది ఒడ్డున ఓ మహిళ తల కలకలం

మనుషులు ..జంతువుల కన్నా క్రూరంగా మారారు. సాటి మనిషి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. మనిషిని దారుణంగా చంపడమే కాదు ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా, తాజాగా మూసీ నది ఒడ్డున ఓ మహిళ తల దొరకడం సంచలనంగా మారింది.

మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడ మూసీ నది ఒడ్డున ఓ మహిళ తల కనిపించింది. ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉన్న తలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొండెం లేని తలను ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు చెబుతున్నారు. మొండెం ఎక్కడ ఉందో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడో హత్య చేసి.. తలను కోసి.. మూసీ నదిలో పడేసిట్లు ఘటనా స్థలాన్ని చూస్తే అర్థం అవుతుంది. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మొండెం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అసలు ఈ మహిళా ఎవరు..ఏ ప్రాంతానికి చెందింది..ఎవరు ఇంత దారుణంగా హత్య చేసారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.