రవితేజ ను బాలయ్య కొట్టడం ఫై పబ్లిక్ గా క్లారిటీ ఇచ్చిన రవితేజ
చిత్రసీమలో గత కొన్నేళ్లుగా ఓ వార్త వినిపిస్తూనే ఉంది. అదే ఒక హీరోయిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ మధ్య పెద్ద గొడవ జరిగిందని.. ఆ సమయంలో కోపం తట్టుకోలేక రవితేజపై బాలయ్య చేయి చేసుకున్నాడని.. దీనిపై ఇప్పటివరకు ఎవరూ ప్రత్యక్షంగా స్పందించలేదు. ఈ వార్తలను ఖండించలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ నిజమేనని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్తల ఫై రవితేజ క్లారిటీ ఇచ్చారు.
ఆహా లో బాలకృష్ణ హోస్ట్గా అన్స్టాపబుల్ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కు ఇప్పటికే అనేక మంది గెస్ట్ లుగా వచ్చి అనేక విశేషాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఎపిసోడ్తో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమయ్యారు బాలకృష్ణ. ఈ ఎపిసోడ్లో మాస్ మహారాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని సందడి చేయనున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఇందులో బాలకృష్ణతో గొడవపై రవితేజ చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి. ‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని రవితేజను బాలకృష్ణ అడగ్గా.. ‘పనీపాట లేని డ్యాష్ గాల్లకు ఇదే పని’ అంటూ ఘాటు రియాక్షన్ ఇచ్చారు రవితేజ. మీకు కోపం వచ్చినప్పుడు వాడే నాలుగు బూతులు చెప్పమని బాలయ్య అడగడంతో.. నేను బూతులు మొదలు పెడితే చస్తారు గానీ అంటూ ఫన్నీగా స్పందించారు. ఇకపోతే రవితేజపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను కూడా టచ్ చేస్తూ ప్రశ్నించారు బాలయ్య బాబు. ‘హెల్త్కు, ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు’ అని అడగ్గా.. ‘మొదట నాకే ఆశ్చర్యమేసింది. బాధ ఎక్కడ పడ్డానంటే.. పెంట పెంట చేశారు. అది కొంచెం బాధేసింది’ అంటూ ఓపెన్ అయ్యారు.
నిజానికి భద్ర సినిమా సమయంలో హీరోయిన్ మీరా జాస్మిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ మధ్య పెద్ద గొడవ జరిగిందని చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. రవితేజపై బాలయ్య చేయి కూడా చేసుకున్నాడని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ గొడవల కారణంగానే.. బాలకృష్ణ సినిమా వస్తున్నప్పుడు తన సినిమాను కూడా రవితేజ రిలీజ్ చేస్తున్నాడని అంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత దీనిపై ఇద్దరు హీరోలు ఒక దగ్గర కూర్చుని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.