కేసీఆర్ సభతో బిజెపి నేతలకు దిమ్మ తిరిగిపోయింది – హరీష్ రావు

ఆదివారం బంగారిగడ్డ లో జరిగిన కేసీఆర్ సభ తో బిజెపి నేతలకు దిమ్మ తిరిగిపోయింది అన్నారు మంత్రి హరీష్ రావు. మునుగోడు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే విధంగా సభ నిర్వహించామని , కేసీఆర్‌ సభ ప్రజాభిమానాన్ని చాటిచెప్పిందన్నారు . మునుగోడులో గెలుపు ముమ్మాటికీ ఖాయమైందని , శాబ్దాల ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. చండూరులో ఆదివారం నిర్వహించిన సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు బీజేపీ డీఎన్‌ఏగా మారిపోయిందన్నారు. బిజెపి నేతలు నోటికి వచ్చినట్లు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి అబద్ధాలకు డిఎన్ఏ గా మారిపోయింది అన్నారు. మునుగోడు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని.. టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో 40 వేలకు పైగా ఆసరా పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో బిజెపి ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని హరీష్ రావు అన్నారు.