160 సీట్లతో టిడిపి, జనసేన అధికారంలోకి రాబోతుందిః అచ్చెన్నాయుడు

TDP AP president Atchannaidu

అమరావతిః 160 స్థానాలతో టిడిపి, జనసేన అధికారంలోకి రాబోతున్నామని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు . మనకు తోడుగా జనసేన ఉంది….కరెక్ట్ టైంలో.. మంచి హృదయంతో టిడిపితో పొత్తు ప్రకటించారని వెల్లడించారు. ఏదైనా జనసేనతో కలిసే వెళ్లాలని.. చంద్రబాబుకు మద్దతిచ్చిన పవనుకు టిడిపి విస్తృత స్థాయీ సమావేశం కృతఙతలు తెలుపుతోందని పేర్కొన్నారు.

ఎల్లుండి జనసేనతో సమావేశం ఉంది.. భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. కరవు వల్ల రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారని.. కరువుతో అల్లాడుతోన్న రైతులను పలకరిద్దాం.. ఎండిన పంటలను పరిశీలిద్దామని చెప్పారు. జనసేనతో కలిసి ఈ పోరాటం చేపడదామని.. 160 స్థానాలతో టిడిపి, జనసేన అధికారంలోకి రాబోతున్నామని పేర్కొన్నారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారు. టిడిపి ఓట్లను తొలగిస్తున్నారు.. దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆగ్రహించారు. భర్త జైల్లో ఉంటే భార్య ఎంతో బాధపడుతుంది…నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు.