తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం – బిజెపి ఎంపీ లక్ష్మణ్

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో క్లీన్ స్వీప్ చేస్తాం అన్నారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..తెలంగాణలో బిజెపిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని , అలాగే ఏపీలో తమకు జనసేన పార్టీతో తప్ప మరే ఇతర పార్టీతో పొత్తులేదని స్పష్టం చేశారు.

అలాగే కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ప్రశ్నించగా, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామన్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమించడమే కేంద్ర మంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు లక్ష్మణ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా నియమితులైన రెండో వ్యక్తిని తానే అంటూ ఆనందం వ్యక్తం చేశారు.