వరంగల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా మందకృష్ణ?

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సంబదించిన కసరత్తులు మొదలుపెట్టాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే..రీసెంట్ గా బిజెపి కేంద్ర మంత్రి అమిత్ హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ బిజెపి నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన దిశానిర్దేశం చేసారు.

ఈ తరుణంలో ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది…ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దించాలని బీజెపీ యోచిస్తున్నట్లు సమాచారం. మందకృష్ణ కు టికెట్ ఇస్తే.. మాదిగల ఓటు బ్యాంకును దక్కించుకోవచ్చని అధిష్టానం చూస్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజెపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజెపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి వరంగల్ టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.