రూ.100 కోట్లు దాటినా విరూపాక్ష కలెక్షన్స్

కథలో దమ్ము ఉండాలే కానీ స్టార్ కాస్ట్ తో సంబంధం లేదని విరూపాక్ష తో మరోసారి రుజువైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ..,మొదటి వారం లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 57.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు నాల్గు వారాల్లోనే రూ. 100 కోట్లు క్రాస్ చేసి , తేజ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంకా చాల చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇక ఈ చిత్ర ఓటిటి రైట్స్ దక్కించుకున్న నెట్ ప్లెక్స్ ఈ నెల 21 నుండి స్ట్రీమింగ్ చేయబోతుంది. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన చేసింది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను సైతం అలరిస్తుందని చెప్పొచ్చు.