పండంటి కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి, ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్ర సోషల్‌ మీడియాలో వేదికగా తెలిపారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్‌ చేశారు. “ద్రిప్త, శర్వస్… మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు” అని రాసుకొచ్చారు. రాహుల్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

2014 లో ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేసి పలు వివాదాల్లో చిక్కుకుంది. ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ‌కు ఎదురైన ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియా స‌హా ప‌లు మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. ఆ స‌మ‌యంలో ద‌క్షిణాదిన మీ టూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో చిన్మ‌యి చొర‌వ చూపారు. సీనియ‌ర్ నటుడు రాధా ర‌వి.. ప్ర‌ముఖ పాటల ర‌చ‌యిత వైర‌ముత్తుల‌పై ఈమె ఆరోప‌ణ‌లు చేశారు. ఇక రాహుల్‌ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రాహుల్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు.