‘విధి విలాసం’
అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎస్కెస్ క్రియేషన్స్ బ్యానర్పై శివ దినేష్ రాహుల్ అయ్యర్ నకరకంటి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం విధి విలాస్.. దుర్గా నరేష్ గుత్తా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈచిత్రం హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. తొలిసన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్సత్తార్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు హరీష్శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.. తొలిసన్నివేశానికి డైరెక్టర్ దశరధ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్, చిత్రం యూనిట్కు స్క్రిప్టు అందించారు.. దర్శకుడు మాట్లాడుతూ, టైటిల్కు మంచి స్పందన వస్తోందన్నారు. రామాయణం ఎలాగైతే మూడు కోణాల్లో ఉంటుందో మా సినిమాను కూడ అలాగే అర్ధం చేసుకుంటారు అన్నారు..కార్యక్రమంలో శివాత్మిక, నిర్మాత శివ దినేష్ అయ్యర్ హీరో అరుణ్ ఆదిత్ తదితరులు మాట్లాడారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/