‘కాక్ టైల్’ ప్రారంభం
చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో అల్లూరి మాధవి నిర్మించనున్న హిలెరియస్ కామెడీ ఎంటర్టైనర్ ‘కాక్టైల్ ..ఈచిత్రం ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్నగర్ దైవసన్నిదానంలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.. ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొంది.. దర్శకుడు మాట్లాడుతూ,యువత భవితపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంతో , అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకోనున్న చిత్రమన్నారు.. పాత, కొత్త ఆర్టిస్టులతో ఈచిత్రం తెరకెక్కనుందనానరు. ఫిబ్రవరి 2నుంచి రెగ్యులర్షూటింగ్ హైదరాబాద్, గోవాల్లో జరపనున్నామని వివరించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/andhra-pradesh/