‘వధు కట్నం’ షూటింగ్ పూర్తి
శ్రీహర్ష , ప్రియ, రఘు, కవిత, ఆర్యన్, రేఖ, కుషాల్, అనోన్య, మణిచందన, నాగలక్ష్మి ప్రధాన పాత్రధారులుగా గ్రీన్ క్రాస్ థియోపోఫికల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ సమర్పణలో షబాబు ఫిలిమ్స్ పతాకంపై భార్గవర గొట్టిముక్కల దర్శకత్వంలో షేక్ బాబు సాహెబ్ నిర్మిస్తున్న సందేశాత్మక కుటుంబ కథా చిత్రం వధు కట్నం.. ఇలా జరగొచ్చేమో.. షూటింగ్ పూర్తిచేసుకుంది.. సమాజంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి కారకులైన వారిని ప్రశ్నిస్తూ.. పరిష్కారానికి ముందుకు రండి అని మహిళా లోకానికి పిలుపునిచ్చే ఒక మహిళా నాయకురాలాఇగా ఉద్యమం ఇదిరా.. అనేపాటలో ప్రముఖ నటి మణిచందన నటించారు.. వర్ధమాన యువ రచయిత శ్రీరాం తపస్వి రచించిన ఈ గీతానికి ప్రవీణ్ లంక ఉద్వేగభరితమైన బాణీని అందించారు. దర్శకుడు మాట్లాడుతూ, నిర్మాత తనను పూర్తిగా నమ్మి పూర్తి స్వేచ్చనిస్తూ, ఈచిత్రానికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించారన్నారు.. నిర్మాత మాట్లాడుతూ, అన్నివర్గాలప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందన్నారు..అతి త్వరలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/