వీరసింహ రెడ్డి నుండి రొమాంటిక్ సాంగ్ రాబోతుంది
వీరసింహ రెడ్డి నుండి రొమాంటిక్ సాంగ్ రాబోతుంది. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా సినిమాలోని రెండో సాంగ్ సుగుణ సుందరి.. అంటూ సాగే డ్యూయెట్ ను డిసెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.
బాలయ్య మరియు శృతి హాసన్ కాంబోలో ఈ పాట ఉంటుంది. మొదటి పాట బాలయ్య.. కు మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే ఈ పాట కూడా తప్పకుండా బాగుంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీ లో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసందD’ ఫేం శ్రీలీలా, బాలకృష్ణకు కూతురిగా నటిస్తుంది.