వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ హైలైట్స్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహరెడ్డి మూవీ ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం ఒంగోలు లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు భారీ ఎత్తున నందమూరి అభిమానులు హాజరయ్యారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హనీ రోస్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, సప్తగిరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 12 న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒంగోలు లో ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున నిర్వహించారు.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది నా జీవిత ఆశయం. ఇద్దరు క్రాక్‌లు కలిస్తే ఎలా ఉంటుందో? గోపీచంద్ మలినేని, నేను కలిస్తే అలా ఉంటుంది. ఒంగోలు గిత్త ఈ గోపీచంద్ మలినేని. ఎన్ని సినిమాలు చేసినా.. నాకు ఇంకా కసి తీరలేదు. బాలకృష్ణ ఇక రాడులే.. రాజకీయాలకే పరిమితంలే అనుకున్నారు. కానీ కొత్తగా ట్రై చేస్తున్నా. ఈ క్రమంలో చేసిన ఆహా అన్‌స్టాబబుల్ ఇప్పుడు టాక్ షోలకే అమ్మ మొగుడై కూర్చుంది. ఏదో కొత్తదనం ఇవ్వాలనే తాపత్రయంలో చేసిందే ఆ షో. ఈ మూవీలో ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు. కానీ దాని వెనుక ఒక బలమైన కథ ఉంది. హీరోయిన్ శృతి హాసన్, విలన్‌గా నటించిన దునియా విజయ్ చాలా బాగా నటించారు’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..”ఒకప్పుడు బాలయ్య బాబు అభిమానిగా ‘సమరసింహా రెడ్డి’ సినిమాకి వెళ్లిన నేను, ఈ రోజున ఆయన సినిమాను డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాను .. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి?” అన్నాడు. “బాలయ్య బాబు సెట్ కి వస్తే ఆయనను నేను ఒక అభిమానిగా .. ఒక దర్శకుడిగా దగ్గర నుంచి గమనించాను. అభిమానులకు ఆయన నుంచి ఏం కావాలో అది రాబట్టుకున్నాను. ఆయనకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కానీ ఆయనతో సినిమా చేసే ఛాన్స్ నాకు మాత్రమే దక్కింది. నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టం” అని చెప్పాడు.

“ఇక శ్రుతి హాసన్ తో నేను చేసిన మూడో సినిమా ఇది .. ఆమె నా లక్కీ హీరోయిన్. తన యాక్టింగ్ .. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. హానీ రోజ్ కూడా డాన్స్ చాలా బాగా చేసింది. భానుమతిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటన .. దునియా విజయ్ విలనిజం ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అంటూ ముగించాడు.