50 రోజులు పూర్తి చేసుకున్న వీర సింహ రెడ్డి

నందమూరి నట సింహ బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి మూవీ సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. నందమూరి బాలకృష్ణ – శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అఖండ తర్వాత బాలయ్య నుండి సినిమా రావడం ..ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి రేపడం తో ఫస్ట్ డే సినిమాను చూసేందుకు బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ పోటీపడ్డారు. సినిమాకు హిట్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. మూడు రోజుల్లోనే 100 కోట్ల జాబితా లో చేరి అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఇంకా కొన్ని సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘వీరసింహారెడ్డి’ తరువాత చాలా సినిమాలు థియేటర్లకు వచ్చాయి. అయినా ఆ పోటీని తట్టుకుంటూ ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.

ఇదిలా ఉంటే లాంగ్ రన్ లో ఈ మూవీ 75.41 కోట్లని కలెక్ట్ చేసింది. ఈ మూవీ సినిమా బ్రేక్ ఎవెన్ టార్గెట్ 68 కోట్లు కావడం విశేషం. అంటే బిజినెస్ టార్గెట్ కంటే 10 శాతం అధికంగా కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో లాంగ్ రన్ లో ఓవరాల్ లో ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ తో హిట్ బొమ్మగా నిలబడింది. ప్రస్తుతం ఒటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వీరసింహారెడ్డి డిజిటల్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాంలో 17.25 కోట్లు సీడెడ్ లో 16.48 కోట్లు రాబట్టింది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో 64.78 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ కొల్లగొట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.84 కోట్లు ఓవర్సీస్ లో 5.79 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ 75.41 కోట్లని అందుకుంది.