గ్రాండ్ గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్‌మెంట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్‌మెంట్ గత రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు..ఇప్పుడు వివాహ బంధం తో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలో వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో ‘మిస్టర్’ సెట్స్ లో కలుసుకున్నారు. షూటింగ్ సమయం లో ఇరువురి మధ్య స్నేహం పెరిగింది..ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ జంట రెండవ చిత్రం అంతరిక్షం 9000 KMPH చిత్రీకరణ సమయం లో డేటింగ్ చేస్తున్నారనే వార్త వెలుగు లోకి వచ్చింది. చివరికి వరుణ్ తేజ్-లావణ్య కలిసి బహిరంగంగా కనిపించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు వివాహం బంధం తో త్వరలో ఒకటి కాబోతున్నారు.