సాధారణ స్థితి ఎప్పటికో?

వరుణ్‌తేజ్‌ పోస్ట్‌ వైరల్

Varun Tej-
Varun Tej-

మెగా హీరో వరుణ్‌తేజ్‌ సోషల్‌మీడియాలో చాలా తక్కువగా కన్పింస్తుంటారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు..

ముఖ్యంగా హైదరాబాద్‌నగరంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రజలంతా ఇళ్లకేపరిమితం అవుతున్న సంగతి తెలిసిందే.

ఈతరుణంలో హీరో వరుణ్‌తేజ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొత్త పోస్ట్‌పెట్టారు.

కరోనా నుంచి త్వరలో ఈప్రపంచం సాధారణ స్థితికి రావాలని తాను ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. అలాగే పోస్ట్‌తోపాటు తను సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో ను పోస్ట్‌చేశారు..

ప్రపంచం సాధారణ స్థితికి ఎపుడు వస్తుందో..అని అర్ధం తెలుపుతున్న వరుణ్‌తేజ్‌ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది..

ప్రస్తుతం ఆయన బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/