విడాకుల తర్వాత ఫస్ట్ టైం చైతు పిక్ ను షేర్ చేసిన సామ్
ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్న నాగ చైతన్య – సమంత లు నాలుగేళ్ళ పాటు కాపురం చేసి, గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రేమగా , అందరికి ఆదర్శం గా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు తెలియదు. వీరిద్దరూ విడాకులు తీసుకోని కొన్ని నెలలు అవుతున్న ఇంకా వీరిద్దరి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక విడాకుల తరువాత ఎవరి దారి వారు చూసుకున్న ఈ జంట కెరీర్ మీదనే ఫోకస్ పుట్టిన సంగతి తెల్సిందే. చైతూ వరుస సినిమాలతో బిజీగా మారగా.. సామ్ సైతం ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారింది. విడాకుల తర్వాత చైతు కు సంబదించిన అన్నింటిని తిరిగి ఇచ్చేస్తూ, మరచి పోతు వస్తున్న.సామ్.. తాజాగా చైతు పిక్ పోస్ట్ చేసి అభిమానుల్లో సంతోషం నింపింది.
ఇది పర్సనల్ లైఫ్కి సంబంధించింది మాత్రం కాదు. ఇద్దరూ చివరగా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్స్టోరి మజిలీ 3ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 3ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ పోస్టర్ని షేర్ చేసుకుంది. విడాకుల తర్వాత తొలిసారి సామ్ చై ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాసేపటికే నెట్టింట వైరల్గా మారింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరుస ప్లాపుల్లో ఉన్న చైతూ కు భారీ విజయాన్ని అందించింది. సామ్ కి మంచి పేరును తీసుకురావడమే కాకుండా అవార్డులను కూడా తీసుకొచ్చిపెట్టింది. ఇక మజిలీ తరువాత ఈ జంట పూర్తిగా కలిసి నటించింది లేదు. దీంతో ఈ సినిమా అంటే ప్రేక్షకులకు ప్రేమ అని చెప్పాలి.