తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై సెటైర్లు

పవన్ కళ్యాణ్ ఫై నిత్యం విమర్శలు , సెటైర్లు చేసే రామ్ గోపాల్ వర్మ..తాజాగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ కి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం ఫై వర్మ తనదైన శైలి లో సెటైర్లు వేశారు. ‘ ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు’’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పొత్తుపెట్టుకుని పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. కేవలం కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌‌కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి. మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. కూకట్‌పల్లి‌తో పాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు.