మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ కు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలువడం కొత్తమీ కాదు. నిత్యం ఏదోక అంశంపై కామెంట్స్ చేయడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. కొంతమంది ఈయన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకుంటే..మరికొంతమంది లైట్ తీసుకుంటారు. బుధువారం నాగార్జున యూనివర్శిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వర్మ హాజరయ్యారు.

ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని.. అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని అన్నారు. కష్టపడకుండా, ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఇష్టానుసారం జీవించాలని , తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి, ఏదైనా వైరస్‌ వచ్చి నేను తప్ప మగ జాతి అంతా పోవాలని, అప్పుడు తానొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని అన్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూనివర్శిటీ విద్యార్థులకు చెప్పాల్సిన విషయాలు ఇవేనా? అని పలువురు మండిపడుతున్నారు.