విజయసాయిరెడ్డికి మతి భ్రమించింది!
అమరావతి: టిడిపి నేత వర్ల రామయ్య వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రస్ అల్ కయిమా దెబ్బకి ముద్దాయి-2 విజయసాయిరెడ్డి మతి భ్రమించిందని విమర్శించారు. నిన్న ప్రకాశం జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడితే విజయసాయిరెడ్డికి స్పందన కనిపించడం లేదట? అని ప్రశ్నించారు. మంచి కంటి డాక్టర్కు చూపింకోండి అని సలహా ఇచ్చారు. మీ పార్టీ జాతకం నిమ్మగడ్డ ప్రసాద్, రస్ అల్ కయిమా మార్చబోతున్నారు. ఇక సర్దుకోండి అని ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/