టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క స‌మావేశం ప్రారంభం

తిరుమల: టీటీడీ పాలక మండలి కీల‌క స‌మావేశం ప్రారంభ‌మైంది. 49 అంశాలతో టీటీడీ అధికారులు ఎజెండా రూపొందించారు. ఈ సమావేశంలోనే పాలక మండలి టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2022-23 వార్షిక బడ్జెట్ 3,171 కోట్ల అంచనాగా ప్రవేశపెట్టనుంది టీటీడీ బోర్డు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్ పేరుతో మరో నూతన పథకానికి పాలక మండలి శ్రీకారం చుట్టనుంది.

ఈ పథకానికి లక్ష రూపాయలు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్‌గా ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్‌కు ఇచ్చిన విరాళాలను చిన్న పిల్లల ఆపరేషన్ ఖర్చులకు వినియోగించనున్నారు. ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు హుండీ ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. టీటీడీ బోర్డు కొత్త పీఆర్సీని టీటీడీలో అమ‌లు చేయ‌నుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/