జులై 09 నుండి వారాహి రెండో యాత్ర ప్రారంభం

జనసేన పార్టీ వారాహి యాత్ర రెండో షెడ్యూల్ ఎల్లుండి (జులై 09) నుండి ప్రారంభం కాబోతుంది. రీసెంట్ గా ఉభయ గోదావరి జిల్లాలో మొదటి విడుత యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..జులై 09 నుండి ఏలూరు నుండి మొదలుపెట్టబోతున్నారు. ఏలూరు లో జులై 09 సాయంత్రం భారీ సభ నిర్వహించి..యాత్ర మొదలుపెట్టబోతున్నారు.

గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి రెండో విడుత యాత్ర ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించినట్టు జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.