మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వడగాల్పులుః వాతావరణం కేంద్రం హెచ్చరిక
ఈ నెల 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
హైదరాబాద్ః మరో మూడు రోజుల పాటు తెలంగాణలో ఎండ, వడగాల్పుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పలు వీస్తాయని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19 నుంచి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.