ఘనంగా ‘వార్త ‘ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
మలక్ పేట, తార్నాక జోన్ సంచికలను విడుదల చేసిన ఈడి గౌరవ్ సంఘీ
Hyderabad: తెలుగు జాతీయ దినపత్రిక ‘వార్త’ వార్షికోత్సవ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. ‘వార్త ‘ 26వ వార్షికోత్సవం సందర్భంగా మలక్ పేట, తార్నాక జోన్ ‘వార్త’ ప్రత్యేక సంచిక బుధవారం తెలుగు పాఠకులకు చేరింది. బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ లోనే వార్త ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ‘వార్త ‘ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ సంఘీ ప్రత్యేక సంచికను విడుదల చేశారు . ఎడిటర్ దామెర్ల సాయిబాబ, న్యూస్ నెట్ వర్క్ ఇంచార్జి ఎస్ .మురళీధర్ లాల్, ‘వార్త’ మలక్ పేట , తార్నాక జోన్ ఇంచార్జి రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/