తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం

ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలకు సంబదించిన ఓటర్ల జాబితాను గురువారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941కి చేరింది. ఓటర్ల తుది జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 42,15,456కి చేరగా, రంగారెడ్డి జిల్లాలో 31,08,068కి , మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాలో 25,24,951 మంది ఓటర్లకు చేరింది.

మొత్తం తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దగ్గరైంది. ప్రతి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం సవరణల అనంతరం జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీ.

2023 జనవరి లో కూడా అలాగే రిలీజ్ చేసింది. మొత్తం జాబితా ఇలా ఉంది.

తెలంగాణ :

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941
పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250
మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951
సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456
రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)
అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)

ఏపీ :

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868
ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104
ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271
ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162
థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924
అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)
అతి తక్కువగా ఓటర్లు కలిగి వున్న జిల్లా (7.29,085)