ఉద్రికత్తలకు దారితీసిన యూటీఎఫ్ ‘ఛలో విజయవాడ’ పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లంతా ‘ఛలో విజయవాడ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉద్రికత్తలకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు. దీంతో విజయవాడ లెనిన్ సెంటర్కు యూటీఎఫ్ నాయకులు, వేలాదిగా ఉపాధ్యాయులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి అధ్యక్ష, కార్యదర్శులను నిర్బంధించారు.
విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీసులు ధర్నాకు వెళ్లకుండా టీచర్లు ను ముందస్తు అరెస్టులు చేశారు.. నగరంలోకి ప్రవేశించకుండా నలుమూల చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఆందోళనకు తరలివస్తున్న వందలాది మంది టీచర్లను అక్కడే నిలువ రించారు.