హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు

రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ ఫార్మా కంపెనీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఫార్మా కంపెనీ యజమాని, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలను నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెనికేపల్లిలో ఉన్న గ్లాండ్ ఫార్మా ప్రతినిధి ఝాన్సీ లక్ష్మీ, రాజు కుటుంబీకులకు చెందిన నీమ్ ట్రీ ఫాంహౌస్‌లో సోదాలు తనిఖీలు కొనసాగుతున్నాయి.

రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేట ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సదరు ఫార్మాకంపెనీ పెద్దమొత్తంలో పన్నును ఎగ్గొట్టారన్న ఆరోపణలతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది.