అణువణువునా ..ఇరుకున పెడితే.. అణుబాంబవుతుంది..బాలయ్య డైలాగ్ కు పవన్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నందమూరి బాలకృష్ణ కలిసి ఓ షో లో పాల్గొంటే ఎలా ఉంటుందో అన్‌స్టాపబుల్‌ షో రికార్డ్స్ చెపుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పార్ట్ 01 ఆహా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు ఆ రికార్డ్స్ ను మరోసారి బ్రేక్ చేసేందుకు పార్ట్ 2 రాబోతుంది. ఫిబ్రవరి 10 న స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో ను ఆదివారం సాయంత్రం ఆహా రిలీజ్ చేసింది.

ఈ ప్రొమోలో పవన్ కళ్యాణ్ ను మరికొన్ని క్లిష్టమైన ప్రశ్నలను బాలకృష్ణ అడగడం జరిగింది. అంతేకాకుండా.. టీడీపీలోకి రావచ్చుగా అన్నట్లు వ్యాఖ్య కూడా వినిపించింది. అయితే.. ప్రోమో చివర్లో అణువణువునా ..ఇరుకున పెడితే.. అణుబాంబవుతుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యాడు.

మొదటి పార్ట్ లో సినిమాలు మరియు వ్యక్తిగత విషయాల గురించి అడుగగా. పార్ట్ 2 లో పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాడినట్లుగా ప్రోమో చుస్తే అర్ధమవుతుంది. తన అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా విశ్లేషించాడు.. అలాగే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పబోతున్నట్లుగా ప్రోమో లో చూపించారు.

గత ఎపిసోడ్ లో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా రాగా.. ఈ ఎపిసోడ్ లో హరి హర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో బాలయ్య.. మా ఇద్దరితో వర్క్ చేశావు కదా ఎలా అనిపించింది అని ప్రశ్నించగా క్రిష్ సమాధానంగా.. సింహం మరియు పులి మధ్య తల పెట్టినట్లు ఉందని సరదాగా సమాధానం ఇచ్చాడు.
రాష్ట్రంలో నీకు అభిమాని కాని వారు లేరు.. వారి ఓట్లు అన్నీ నీకు ఎందుకు పడలేదు అనుకుంటున్నావు అంటూ పవన్ ను అడిగిన బాలయ్య ప్రశ్నకు సమాధానం ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ సినిమాలు మానేసి ప్రజా సేవకు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటూ బాలయ్య అనగానే ఆడియన్స్ అంతా కూడా అవును అన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల విషయంలో తన ఉద్దేశ్యం ఏంటి అనేది చెప్పగా దాన్ని సస్పెన్స్ గా ఉంచారు. ఓవరాల్ గా ప్రోమో..పార్ట్ 2 ఎపిసోడ్ ఫై ఆసక్తి పెంచేలా చేసింది.

YouTube video