రాష్ట్రంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,59,776..మొత్తం మృతుల సంఖ్య 1,415

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 948 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,607 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,45,293 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,415 కి చేరింది. ప్రస్తుతం 13,068 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,710 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 76 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/