జగన్ సర్కార్‌కు కేంద్రం మరో గుడ్‌న్యూస్..

ఏపీ సర్కార్ కు కేంద్రం వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. కర్నూల్‌కు హైకోర్టు తరలింపు హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. హైకోర్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌న్నీ రాష్గ్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందని.. హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించడంపై రాష్ట్ర ప్ర‌భుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉంది అన్నారు. ఆ త‌ర్వాత ఆ ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూల్‌కు హైకోర్టు తరలింపు అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు. ఇక్కడ భవనం నిర్మించి హైకోర్టును ఏర్పాటు చేశారు.. కానీ జగన్ సర్కార్ మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.. హైకోర్టును కర్నూలకు తరలించాలని నిర్ణయం తీసుకుంది.. కానీ తరలింపుకు సిద్ధమైనా.. కొన్ని పిటిషన్ల కారణంగా ఆగింది. ఇప్పుడు కేంద్రం క్లారిటీ రావడం తో జగన్ సర్కార్ హ్యాపీ గా ఫీల్ అవుతుంది.