మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీః ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో… సభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.