ప్రధాని మోడీకి ఉక్రెయిన్ మహిళ విజ్ఞప్తి
ఉక్రేనియన్లకు సహాయం చేయండి.. వారు శాంతియుత ప్రజలు..ఉక్రెయిన్కు చెందిన మహిళ ఒలిజా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ప్రజల్ని కాపాడాలని భారత ప్రధాని నరేంద్రమోడీని ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళ కోరింది. ఉక్రెయిన్కు చెందిన ఒలిజా అనే మహిళ కాశ్మీరి వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె జమ్ముకాశ్మీర్ లోని ట్రాల్లో నివసిస్తున్నారు. అయితే పుల్వామా ఇంటికి తిరిగి వచ్చినా.. ఆమె తన కుటుంబం గురించి ఆందోళన చెందుతోందన్నారు. ఉక్రెయిన్లో ఉన్న తన కుటుంబాన్ని ప్రజల్ని కాపాడాలని ఆమె ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. ఒలిజా మాట్లాడుతూ.. “నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబం అక్కడ ఉన్నందుకు నా గుండె తల్లడిల్లుతుంది. ఉక్రేనియన్లకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. వారు శాంతియుత ప్రజలు. అంటూ ఆమె ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/