హైదరాబాద్‌ నుంచి మరో రెండు వందే భారత్ ట్రైన్లు

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే తెలుగు రాష్ట్రాలు రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతుండగా..మరో రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పూణె మధ్య వందే భారత్ ట్రైన్లను తీసుకరాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే వీటిని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరో మూడు, నాల్గు నెలల్లో ఈ రెండు వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి తీసుకరాబోతుంది. ఈ రెండింటిలో ఒక ట్రైన్ కాచిగూడ-బెంగళూరు మధ్య ప్రయాణించనుండగా.. మరో ట్రైన్ సికింద్రాబాద్-పూణె మధ్య సర్వీసులు అందించనుంది. దక్షిణ మధ్య రైల్వేతో కలిసి భారతీయ రైల్వే ఈ రెండు సర్వీసులకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-బెంగళూరు రూట్ల మధ్య అనేక ట్రైన్లు ప్రయాణం సాగిస్తున్నాయి. వీటిల్లో 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. కానీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ రెండు సిటీల మధ్య అందుబాటులోకి వస్తే కేవలం 8 గంటల్లోనే చేరుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తంది.