ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు కుటుంబ సబ్యులకు టెన్షనే. మృతువు ఏ రూపంలో ఎటు నుండి వస్తుందో అర్థంకాని పరిస్థితి. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసాయి.

వివరాల్లోకి వెళ్తే..సిరికొండ మండలానికి చెందిన జాదవ్ సుభాష్, జాదవ్ కిషన్ ఎడ్లను కొనుగోలు చేయడానికి టీవీఎస్ ఎక్సెల్ పై బోథ్ మండలం పొచ్చరకు వరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కుప్టౌ వద్ద వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.