మరోసారి రచ్చకెక్కిన గుంటూరు వైఎస్‌ఆర్‌సిపి నేతల మధ్య విభేదాలు

ఎమ్మెల్యే, మేయర్ మధ్య వాగ్వాదం

Once again differences between Guntur YSRCP leaders

గుంటూరు ః గుంటూరు వైఎస్‌ఆర్‌సిపిలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. మేయర్ మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సందర్భంగా మేయర్ పై ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కొరత అంటూ తన నియోజకవర్గంలో పనులు చేయడం లేదని మండిపడ్డారు. గతంలో పలు కౌన్సిల్ సమావేశాల్లో తాను వివాదం చేయడం వల్లే కొన్ని పనులైనా జరిగాయని అన్నారు. కావాలనే తన నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో మేయర్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. కౌన్సిల్ సమావేశం మధ్యలోనే ముస్తఫా వెళ్లిపోయారు.