ట్విట్టర్లో సమస్యలు.. దేశవ్యాప్తంగా సర్వర్ డౌన్
న్యూఢిల్లీః ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ సేవలో ఈరోజు భారత్లో అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో సమస్యలు ఉన్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ ఫస్ట్ పేజీ లోడ్ అయిన సమయంలో.. మళ్లీ ట్రై చేయాలంటూ వార్నింగ్ పాప్అప్ వస్తున్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఉదయం ఏడు గంటల సమయంలోనూ ట్విట్టర్ పూర్తిగా బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సమస్య వెబ్ వినియోగదారులకు మాత్రమే తలెత్తగా.. మొబైల్లో మాత్రం యాప్ బాగానే పనిచేసింది. కాసేపటికి సమస్య పరిష్కారం కావడంతో వెబ్లోనూ ట్విట్టర్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
ఇటీవలే ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థలో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్లను కూడా తొలగించారు. భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా నేటి నుంచి మొదలుపెట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని మస్క్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/