పులివెందులను ఇతర నియోజకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటుః తులసిరెడ్డి

పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్న తులసిరెడ్డి

TULASI REDDY
TULASI REDDY

అమరావతిః సిఎం జగన్‌ నిన్న కుప్పంలో పర్యటించిన సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కుప్పంను చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని… ఆయన ఒక చేతకాని నేత అని అన్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సెటైర్లు వేశారు. కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని తులసిరెడ్డి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు అయిన సునీత కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని చెప్పారు. అలాంటి పులివెందులను ఇతర నియోకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత తదితరాలన్నీ నాన్న బుడ్డీకి చాలడం లేదని ఎద్దేవా చేశారు. ముట్టిముంత ఇచ్చి వెండి చెంబును దొంగిలించినట్టుగా వైఎస్‌ఆర్‌సిపి తీరు ఉందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/