శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

తిరుమల: ఈ నెల 19(శనివారం) నుంచి 27 తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో తిరుమల గిరులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన గోపురంతో పాటు మాడవీధులు విద్యుద్దీపాల వెలుగు జిలుగులతో కనువిందు చేస్తున్నాయి. టీటీడీ గార్డెనింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఘాట్రోడ్కు మరమ్మతులు చేసి పిట్టగోడలకు రంగులు వేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/