తాడిపత్రి మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో టీడీపీ హావ

తాడిపత్రి లో మరోసారి తెలుగుదేశం పార్టీ హావ కొనసాగింది. ఈ ప్రాంతంలో తమకు ఎదురులేదని జెసి బ్రదర్స్ నిరూపించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలోను అధికార వైసీపీ పార్టీ కి భారీ షాక్ ఇచ్చారు జేసీ బ్రదర్స్. మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో టీడీపీ సభ్యులు గెలుపొందారు. టీడీపీకి చెందిన ముస్తాక్‌ అహ్మద్‌, షమీమ్‌, బింగి ప్రభాకర్‌ విజయం సాధించారు. అయితే టీడీపీ సభ్యులు ఎన్నిక కావడం తట్టుకోలేకపోయిన వైసీపీ సభ్యులు… కౌన్సిల్‌ హాల్‌ను బాయ్‌కట్‌ చేసి వెళ్లిపోయారు.

ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల్ని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాడతామని… తనపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయనని మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో తాడిపత్రిలో చేసి చూపిస్తామన్నారు.