టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి (28)కన్నుమూశారు. మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురికావడం తో ఆయన్ను చెన్నై లోని కావేరి హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.

చంద్రమౌళికి ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. చంద్రమౌళి ముంబై లో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై అల్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికే గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.