తిరుమలలో డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన

నాలుగు వేర్వేరు రూట్లలో డబుల్ డెక్కర్ ఇ-బస్సులు

TTD Chairman Bhumana who started double decker bus in Tirumala

తిరుమలః తిరుపతి రోడ్లపై డబుల్ డెక్కర్ ఇ-బస్సులు పరుగులు తీయనున్నాయి. ఈ బస్సులను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో భూమన డబుల్ డెక్కర్ బస్సుకు పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ బస్సులో తిరుపతి నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రయాణించారు.

ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడారు. స్థానికులకు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఓ నగరపాలక పరిధిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ బస్సులో ప్రయాణించే వారికి సరికొత్త అనుభూతి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

కాగా, ఇవి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు. వీటిని తిరుపతిలోని నాలుగు ప్రధాన రూట్లలో నడపనున్నారు. ప్రస్తుతం ఒక బస్సును నడిపి, మలివిడతలో మిగతా డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.