TSSPDCL జూనియ‌ర్ లైన్‌మెన్ ప‌రీక్ష ర‌ద్దు

TSSPDCL జూనియర్ లైన్‌మెన్ పరీక్ష రద్దయ్యింది. జూలై 17న 1000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేసారు. ఘట్‌కేసర్‌ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి ఫోన్ తో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

తమకు సమాధానాలు చెబుతామని రూ.లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్థి అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. త్వ‌ర‌లోనే కొత్త నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తామ‌ని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్ర‌క‌టించారు.