మళ్లీ గడ్డిఅన్నారంలో పండ్ల విక్రయాలు
హైదారాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో గడ్డి అన్నారంలోని పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కోహెడ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే నిన్న గాలివాన సృష్టించిన భీభత్సానికి కోహెడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు ధ్వంసం అయ్యాయి. దీనితో రైతులకు ఇబ్బందులు కలగకుండా నేటినుంచి మూడు రోజుల పాటు గడ్డి అన్నారం మార్కెట్ను తెరిచి పండ్ల విక్రయాలు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మూడు రోజుల్లోగా దెబ్బతిన్న మార్కెట్ పునరుద్దరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/