గ్రూప్ 4 ఎగ్జామ్ తేదీ ఖరారు

గ్రూప్ 4 పరీక్షల తేదీని ఖరారు చేసింది TSPSC . గ్రూప్ 4 పరీక్షను జులై 1న నిర్వహించనున్నట్టు తెలిపింది. రెండు సెషన్స్ లో రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్ష జరపనున్నారు. ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును టిఎస్‌పిఎస్‌సి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. టిఎస్‌పిఎస్‌సి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం(జనవరి 30)తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. తాజాగా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 8,180 గ్రూప్ 4 పోస్టులకు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కమిషన్ తెలిపింది. గత ఆదివారం ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.